జీవోను రద్దు చేయాలని వివోఎల ధర్నా
NEWS Nov 20,2024 06:58 pm
ఎపి వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్ కి వినతిపత్రం అందించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ వివోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ 3 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న యానిమేటర్లను తొలగించాలని ఇచ్చిన సర్క్యులర్ ని తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు.