చదువుతోనే ఉన్నత శిఖరాలు
NEWS Nov 15,2024 02:41 pm
చదువుతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి చదివించాలని ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ సూచించారు. గుంటుపల్లిలో డాన్ బాస్కో (సిబిఎస్ఈ) స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకుల ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగాయి. స్కూల్ ప్రిన్సిపాల్ సందీప్ రెడ్డి విద్యా వార్షిక నివేదిక ను ప్రవేశపెట్టారు. విద్యా విధానంలో అనుసరిస్తున్న విధానాలను వివరించారు. తమ విద్యార్థులు సాధించిన విజయాలను తెలియజేశారు.