Logo
Download our app
పేద బాలికల కోసం ఎంపీ ఉదార‌త‌
NEWS   Nov 15,2024 07:54 am
NDAలో యంగెస్ట్ ఎంపీగా పేరొందిన శాంభవి చౌదరి తన ఐదేళ్ల జీతాన్ని అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘చదువుకుంటేనే సమస్తిపూర్ వృద్ధి చెందుతుంది’ అనే నినాదంతో ఆమె తన శాలరీని ఖర్చు పెట్టనున్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source