టీమ్ ఇండియా ఫొటో షూట్!
NEWS Nov 14,2024 04:36 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సిరీస్ కోసం భారత క్రికెటర్లకు ఫొటో షూట్ నిర్వహించారు. ఈ ఫొటోల్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ కొత్త లుక్లో అదరగొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ నెల 22 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.