చక్రాల కుర్చీలు ఎక్కడ?
NEWS Nov 13,2024 10:42 am
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి దర్శనానికి వచ్చే నడవలేని దివ్యాంగులకు ఆలయ అధికారులు చక్రాల కుర్చీ సమకూర్చి శీఘ్ర దర్శనం చేయించాల్సి ఉంటుంది. గతంలో పలువురు దాతలు ఆలయానికి చక్రాల కుర్చీలు అందజేసినప్పటికీ వాటిని వినియోగించడం లేదు. దీంతో కామారెడ్డికి చెందిన ఓ భక్తుడు ఇలా ఇబ్బంది పడుతూ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్లడం కనిపించింది.