పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
NEWS Nov 13,2024 04:20 am
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి కేసులో సూత్రదారిగా ఉన్న భోగమోని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి పలు మార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లు తెలుస్తోంది. 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిలో 39 మందిని నోటీసులు ఇచ్చి నుంచి పంపించివేశారు.