సోలార్ పవర్ కు భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS Nov 09,2024 07:32 am
గుడిబండ మండలంలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు భూములను టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుస కరువుతో చీడ పీడలతో కూలీల కొరతతో సతమతమవుతూ వ్యవసాయం చేసి నష్టపోయి సంక్షోభంలో ఉన్న రైతులకు స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.