కొండగట్టులో భక్తుల రద్దీ
NEWS Nov 09,2024 07:32 am
ప్రముఖ పుణ్యక్షేత్రము కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.