భారత సంతతి నేతల గెలుపు
NEWS Nov 06,2024 04:49 am
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు గెలిచారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి.. ఇల్లినోయీ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడ్డారు. రాష్ట్రంలోని 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన విజయం సాధించారు. నార్తర్న్ వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. సుహాస్ కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫునే ఎన్నికల బరిలో నిలిచారు. నార్తర్న్ వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి సుహాస్ విజయం సాధించారు.