దాశరథి.. తెలంగాణ నిను మరువదోయి!
NEWS Nov 05,2024 04:27 am
పెత్తందారులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య. మధ్యయుగాల రాచరికపు బలాన్నే తన కవితకు ప్రేరణగా మలుచుకొన్నారు. ‘ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలినరాజు మాకెన్నడు’ అని గర్జించారు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు. ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి పెద్దరికం చేస్తావా? 3కోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి’ అని హెచ్చరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించారు. నేడు దాశరథి వర్ధంతి.