అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె దగ్ధం
NEWS Nov 05,2024 04:00 am
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో జుంబర్తి గంగారం అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసె సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదంలో కాలిపోయిందని గ్రామస్థులు తెలిపారు. గంగారం పూరి గుడిసెలో ఒంటరిగా నివసిస్తున్నారు. వంట చేసుకునే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ వెలిగించారు. కొద్దిసేపు తర్వాత మంటలు గుడిసె అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయిందని బాధితుడు గంగారం రోదిస్తూ తెలిపారు.