సెలవు వస్తే మొక్కలు నాటడమే.. విశ్వామిత్ర
NEWS Nov 04,2024 05:10 pm
సెలవు వస్తే మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్న చిన్నారి విశ్వామిత్ర చౌహన్ (5)ను పలువురు అభినందిస్తున్నారు. స్థానిక కొత్తగూడెం పట్టణంలోని భజన మందిరం ఆలయ ప్రాంగణంలో హరిత దీక్షలో భాగంగా చిన్నారి 20 మొక్కలను వితరణ చేసి నాటారు. పర్యావరణ ప్రేమికుడిగా, తాను చేపట్టిన హరిత దీక్షను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులతో, అధికారులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారు.