జగిత్యాల: నవజాత శిశువుల తారుమారు
NEWS Nov 04,2024 10:37 am
జగిత్యాల MCHలో అప్పుడే జన్మించిన నవజాత శిశువులు తారుమారయ్యారు. దీంతో బంధువులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్పూర్ మండలం మంగేలా గ్రామానికి చెందిన ప్రసన్న పురిటి నొప్పులతో MCHలో చేరింది. సోమవారం ప్రసన్నతో పాటు మరో గర్భిణీకి డాక్టర్లు డెలివరీ చేశారు. తర్వాత ఆస్పత్రి సిబ్బంది శిశువుల చేతికి ఉన్న ట్యాగ్స్ చూసుకోకుండానే ఒకరి బేబీని మరొకరికి ఇచ్చారు. కాసేపటికి జరిగిన పొరపాటున గుర్తించి ఎవరి పిల్లలను వారికి తిరిగి అప్పగించారు.