నేడు MP రఘునందన్ రావు పర్యటన
NEWS Nov 04,2024 07:23 am
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి మండలంలో సోమవారం మెదక్ ఎంపీ మాధవ నేని రఘునందన్ రావు నేడు పర్యటిస్తున్నారు. మండల పరిధిలోని మహమ్మద్ నగర్ ముండ్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ప్రారంభిస్తారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్నె మాజీ సర్పంచ్ రాజేందర్ తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.