2027లోనే ఎన్నికలు: విజయసాయిరెడ్డి
NEWS Nov 03,2024 11:05 am
AP: వచ్చే ఎన్నికలు 2027లోనే జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి కుంటుపడింది. సీఎం చంద్రబాబుపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ విజయం సాధిస్తుంది. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.