శబరిమల యాత్రికులకు ఉచిత బీమా
NEWS Nov 02,2024 05:55 pm
శబరిమల యాత్రికులకు ఉచిత బీమా కవరేజీని వర్తింప జేయనున్నట్టు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించించారు. ఆలయానికి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తారు. అధికారులే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తారు. 2 నెలలపాటు జరగనున్న మకరవిళక్కు వేడుకలు ఈ నెల 16న మొదలై.. డిసెంబర్ చివరివారం వరకు కొనసాగుతాయి.