సారంగి రమేష్కి డాక్టరేట్
NEWS Nov 02,2024 05:30 pm
ఆర్మూర్: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామస్తుడు సారంగి రమేష్కి ఫార్మసీ రంగంలో ఆయన చేసిన పరిశోధనకు డాక్టరేట్ దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో ప్రొఫెసర్ పార్థసారథి పర్యవేక్షణలో క్యాన్సర్పై పరిశోధనలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శనివారం యూనివర్సిటీలో డాక్టరేట్ అందజేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి రమేష్ కు ఫోన్ ద్వారా హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.