సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం
NEWS Nov 02,2024 05:37 pm
పులివెందుల: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని అని ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పలువురికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. పేదలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.