నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం
NEWS Nov 02,2024 10:40 am
రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి మండల పరిధిలోని గుంటిమడుగు గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బోరుకు నూతన మోటార్ ఏర్పాటు చేయించి గ్రామానికి నీటి సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.