ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Nov 01,2024 09:45 am
వేలేరు: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో PSS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రైతులు పండించిన దాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.