భార్యను హతమార్చిన భర్త అరెస్టు
NEWS Nov 01,2024 09:43 am
మల్లాపూర్: భార్యను చంపిన భర్తను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం.. మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రమేశ్ నెల రోజుల క్రితమే దుబాయ్ నుంచి ఇంటికి వచ్చి భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం అనుమానంతో భార్య సునీతను భర్త రమేశ్ చంపాడు. శుక్రవారం రమేశ్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు మెట్పల్లి డీఎస్పీ తెలిపారు.