రాఖీ పటేల్ సేవాసమితి ఆర్థిక సాయం
NEWS Nov 01,2024 06:19 am
మల్లాపూర్: రాఖీ పటేల్ సేవ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్లో బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న కరత్ వనిత కుటుంబ సభ్యులకు రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ముత్యాల రాకేష్ తొలి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాఖీ పటేల్ సేవ సమితి సంస్థ ద్వారా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలకు ఇక నుండి తమ వంతుగా తోచినంత సహాయం అందిస్తానని నిర్వాహకులు తెలిపారు.