గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
NEWS Oct 31,2024 07:40 am
ధర్మపురి నుంచి జగిత్యాలకు ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్నట్లు చరణ్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గ్రామీణ మండలం పొలాస వద్ద అతనిని గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద నుండి కిలో 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చరణ్ను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.