ఆహారం కల్తీ చేయాలంటే భయపడేలా..
NEWS Oct 30,2024 06:13 pm
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఫుడ్ సేఫ్టీపై మంత్రి సమీక్షించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు.