పాఠశాలలో ఘనంగా దీపావళి సంబరాలు
NEWS Oct 30,2024 06:22 pm
సంగారెడ్డి పట్టణంలో ద మాస్టర్ మైండ్ పాఠశాలలో దీపావళి పండగను పురస్కరించుకొని దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ శేశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సాంప్రదాయ బద్ధమైన దుస్తులు ధరించి వేడుకలలో పాల్గొన్నారు. ఉదయం నుండి విద్యార్థినులు క్లాసులు ముగించుకొని మధ్యాహ్నం విద్యార్థులు బానసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.