Logo
Download our app
న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
NEWS   Oct 29,2024 04:42 pm
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఓడిపోయినప్పటికీ, మహిళల జట్టు వన్డే సిరీస్‌ను అలవోకగా కైవసం చేసుకుంది. స్మృతి మంధాన సెంచరీ, హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో భారత్ 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించింది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో సిరీస్ చివరి మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 232 పరుగులు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source