రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
NEWS Oct 29,2024 11:07 am
కథలాపూర్ మండలం పోసానీపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ బైకు ఢీ కొనడంతో అదే మండలం దుంపేట గ్రామానికి చెందిన తోట లింగం (52)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుపై లింగం పోసానీపేట వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు.