Logo
Download our app
అమరావతి రైల్వేలైన్‌కు ఆమోదంపై హర్షం
NEWS   Oct 24,2024 05:06 pm
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో బీజేపీ మైలవరం నియోజకవర్గ కన్వీనర్ నూతులపాటి బాల హర్షం వ్యక్తం చేశారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం లభించిందన్నారు. 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం, కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం జరగబోతున్నట్లు వివరించారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సిఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source