ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం
NEWS Oct 24,2024 07:42 am
రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ (HDS) సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అనంతరం 317 జీవో ద్వారా తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు నర్సింగ్ సిబ్బంది. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ రమాదేవి, డాక్టర్లు పాల్గొన్నారు.