బుక్ఫేయిర్: 35 పుస్తకాలు.. 800 బిర్యానీలు..
NEWS Oct 23,2024 09:50 am
బుక్ ఫెయిర్లో సందర్శకులు పుస్తకాలకు బదులు బిర్యానీలు, షావర్మాల కోసం ఎగబడ్డారు. బుక్ఫేయిర్లో 35 పుస్తకాలే అమ్ముడుపోగా, 800 బిర్యానీలు, 1,200 షావర్మాలు అమ్ముడుపోయాయి. పుస్తకాల స్టాల్స్ వెలవెలబోతే.. బిర్యానీ స్టాల్స్ జనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో పుస్తక ప్రదర్శనకారులు విస్తుపోయారు. తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. లాహోర్(పాకిస్థాన్)లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.