పీసీసీ చీఫ్ మహేష్ కీలక వ్యాఖ్యలు
NEWS Oct 23,2024 09:18 am
ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్నది హైకమాండ్ నిర్ణయమన్నారు టీ-పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ నిర్ణయం ప్రకారం MLAలను చేర్చుకున్నామని, MLC జీవన్రెడ్డి ప్రతిష్ఠకు భంగం వాటిల్లదన్నారు. గంగారెడ్డి హత్యపై ఉన్నతాధికారులతో మాట్లాడామని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఘటన జరిగిన వెంటనే జీవన్రెడ్డితో మాట్లాడానని, ఆయన ఆవేదనతో మాట్లాడుతున్నారన్నారు. కొత్తగా వచ్చిన నాయకులు పాత నాయకులను కలుపుకోవాలని, జగిత్యాలలోనే కాదు, కొన్నిప్రాంతాల్లో సమస్యలున్నాయన్నారు.