సున్నీలతోనే కమిటీ ఏర్పాటు చేయాలి
NEWS Oct 23,2024 09:51 am
కొండపల్లి షాబుకారి మసీదు వద్ద అహలే సున్నతల్ జమాత్ రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో ప్రత్యేక చట్టంతో మార్పులు తీసుకొస్తాం అంటున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్ర టిడిపి ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సున్నీలతోనే కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన మత గురువులు హాజరయ్యారు.