రహదారి నిర్మాణ పనులు చేపట్టాలి
NEWS Oct 24,2024 05:38 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రాజు తండా నుంచి గోప్య తండా వరకు రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. నిధులు మంజూరైన రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నేటి వరకు రహదారి నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ప్రారంభించలేదని గ్రామ ప్రజలు తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని రహదారి నిర్మాణం చేయించాలని కోరారు.