లోయలో పడిన ఆర్టీసీ బస్సు
NEWS Oct 23,2024 04:57 am
వేంపల్లి: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యా యి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.