BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్!
NEWS Oct 23,2024 07:14 am
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో టారిఫ్లను పెంచే అవకాశం లేదని ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL సీఎండీ రాబర్ట్ రవి చెప్పారు. కస్టమర్ల నమ్మకం, సంతోషమే తమకు ముఖ్యమన్నారు. త్వరలో సుంకాల పెంపుదల అవసరం లేదని ఆయన అన్నారు. BSNL ఇప్పటికే టెస్ట్ మోడ్లో 4జీ సేవలను అందిస్తోందని, ఈ క్యాలెండర్ ఇయర్లో పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగం జరగనుందని రవి వివరించారు. ప్రస్తుతం తమకు 1.8 కోట్ల మంది 4జీ కస్టమర్లు ఉన్నారని చెప్పారు.