నిబంధనల మేరకు టపాసులు విక్రయించాలి
NEWS Oct 23,2024 04:36 am
మదనపల్లి: ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి టపాసులు విక్రయించాలని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. మంగళవారం టపాసులు విక్రయ కేంద్రం కొరకు మిషన్ కాంపౌండ్, బీటీ కాలేజీ గ్రౌండ్ పరిశీలించారు. టపాసులు విక్రయ దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలతలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి శంకరప్ప, సిఐలు చాంద్ బాషా, రామచంద్ర, వెంకటరమణ పాల్గొన్నారు.