బీజేపీ సభ్యత్వం తీసుకున్న అద్వానీ
NEWS Oct 22,2024 01:56 pm
BJP కో-ఫౌండర్, అగ్రనేత LK అద్వానీ పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. 97 ఏళ్ల అద్వానీకి ఎంపీ పురందీశ్వరి సహా తదితరులు మెంబర్షిప్ను అందించారు. 1927లో కరాచీలో జన్మించిన అద్వానీ 1942లో RSSలో వాలంటీర్గా చేరారు. 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు BJP జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. BJP సభ్యత్వ నమోదు 10 కోట్లు దాటింది.