ఎంబీబీఎస్ సీటు సాధించిన దీప్తి
NEWS Oct 21,2024 11:34 am
క్రమశిక్షణ,దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏది ఉండదని ఆచరణలో నిరూపించింది సరస్వతి పుత్రిక దీప్తి. పేద కుటుంబానికి చెందిన దీప్తి కష్టపడి చదివి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఖమ్మం బురహాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో చదువుల తల్లి దీప్తిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు.