సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి ఏఐటీయూసీ
NEWS Oct 21,2024 09:17 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి యాజమాన్యం తక్షణమే కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలపై దృష్టి పెట్టాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ కార్య దర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం కార్పొరేట్లో సివిల్ విభాగం వాటర్ సప్లై, హౌస్ కీపింగ్ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటాచెల్లించాలన్నారు.