కోయగూడెం ఓసి బాధితుల ఆందోళన
NEWS Oct 21,2024 09:17 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు సోమవారం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు మాజీ ఎంపీ బాబురావు మద్దతు ప్రకటించారు.