పత్తి పంటకు గిట్టుబాటు ధర: మంత్రి
NEWS Oct 21,2024 08:44 am
ఖమ్మం జిల్లా: పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు వద్ద సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని తుమ్మల ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.