ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS Oct 21,2024 08:43 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:వాజేడు మండలంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి ఘనంగా స్వాగతం పలికారు. మండల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మారుమూల ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యేని మండల నాయకులు శాలువతో సన్మానించారు.