పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి
NEWS Oct 21,2024 08:42 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.