స్కూటీని ఢీకొన్న ఇసుక లారీ
NEWS Oct 21,2024 04:02 am
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.మండలంలోని మల్లన్నపేటకి చెందిన శశి స్కూటీపై వెళ్తున్నాడు. బస్టాండ్ వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.