Logo
Download our app
బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం
NEWS   Oct 20,2024 05:15 pm
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు బండారు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు కాన్వాయ్లో బయల్దేరారు. కాన్వాయ్లో వెళుతుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డువచ్చాడు. సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన దారిలో ఈ ఘటన జరిగింది.
⚠️ You are not allowed to copy content or view source