రైల్వేకోడూరు: బాధిత కుటుంబానికి పరామర్శ
NEWS Oct 20,2024 05:46 pm
రైల్వేకోడూరు మండలం వెంకటరెడ్డిపల్లి పంచాయతీ రాసపల్లి గ్రామనివాసి టీడీపీ నేత సంగరాజు శ్యామలమ్మ చిన్న కుమారుడు సంగరాజు మహేశ్వర్ రాజు కొద్దిరోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందాడు. ఆదివారం, మాజీ ఎమ్మెల్సీ, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.