పోరుమామిళ్ల: కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
NEWS Oct 20,2024 05:05 pm
పోరుమామిళ్ల మైదుకూరు రోడ్డు వసుంధర కల్యాణ మండపం సమీపంలో ఆదివారం పంచర్ షాప్లో గాలి పట్టుకుంటున్న యువకుడిని వెనక నుంచి ఓమ్ని వ్యాన్ ఢీకొట్టింది. దీంతో యువకుడికి కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా మాచర్ల చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.