కొత్త దంపతులకు MP వద్దిరాజు ఆశీస్సులు
NEWS Oct 20,2024 10:21 am
ఖమ్మం: సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుమారుడు భార్గవ్- చిద్విత సాయిల రిసెప్షన్ ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి MP వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబసభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ,పెద్దన్న వద్దిరాజు కిషన్, కుమారుడు నాగరాజులతో కలిసి నూతన వధూవరులు భార్గవ్-చిద్విత సాయిలకు శుభాకాంక్షలు తెలిపారు.