రైతు భరోసా ఇవ్వాలని BRS ధర్నా
NEWS Oct 20,2024 09:07 am
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టేక్మాల్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నేతలు భాస్కర్, సిద్దయ్య, రవి, గోవింద్ చారి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.