ఉచిత చేపపిల్లల పంపిణీ చేసిన MLA
NEWS Oct 20,2024 08:11 am
మత్స్యకారులకు 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ చింతకుంట చెరువు వద్ద చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేపలను విడుదల చేశారు. అయన వెంట మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, జిల్లా మత్స్య శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.